సిరిసిల్ల తెలంగాణ చౌక్, డిసెంబర్ 31: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్ట్ట్ వివరాలను వెల్లడించారు. నకిలీ షూరిటీ సర్టిఫికెట్లు పెట్టుకొని రిమాండ్ అయిన కేసులో బెయిల్ వచ్చేలా, డేట్ ఆఫ్ బర్త్, దవాఖాన నుంచి తీసుకునే వివిధ మెడికల్ సర్టిఫికెట్లు, కల్యాణలక్ష్మి పొందడానికి నకిలీ అర్హత పత్రాలు, వీఐపీలు ఇచ్చే వివిధ లెటర్ప్యాడ్లతో అర్హతలేని నకిలీ సర్టిఫికెట్లు ఇస్తూ ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తున్న సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన రిటైర్డ్ టీచర్ చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిపారు.
ఈ విచారణలో నిందితుడికి సహకరించిన ప్రకాశ్, శివాజీ, రాజేశ్, అడ్వొకేట్ విష్ణు, మరో వ్యక్తిని అరెస్ట్ట్ చేసి రిమాండ్కు తరలించగా, శీలం రాజేశ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీరి వద్ద నుంచి స్టాంప్ ప్యాడ్స్, నాలుగు సెల్ఫోన్స్, పాలీ స్టాంపర్, ముట్టీలు, సిలికాన్ షీట్ వివిధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐ కృష్ణ, టాస్క్ఫోర్స్ సీఐ సదన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.