CP Amber Kishore Jha | పెద్దపల్లి కమాన్, ఫిబ్రవరి 6 : పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్లు సీపీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ గదులు, పరిసరాలను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐలు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.