పెగడపల్లి : జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపలికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెల్మ సత్యనారాయణ రెడ్డి కుమారుడు పూర్ణ చందర్ రెడ్డిని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం పరామర్శించారు. కరీంనగర్లోని ఓ దవాఖానలో పూర్ణచందర్ రెడ్డి మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.