సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్బాబు
స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు
మందమర్రి రూరల్, జూన్ 27 : పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఏరియాలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మరో 15 రోజులు నిర్వహించాలన్నారు. గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని, దీనిపై కార్మిక కుటుంబాలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జీఎం కార్యాలయ సిబ్బందికి జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కృష్ణారావు, డీజీఎం సివిల్ శ్రీనివాసులు, పీఎం వరప్రసాద్, పర్యావరణ అధికారి ప్రభాకర్, జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్మిక కాలనీల్లో ఆకస్మిక తనిఖీ..
సీసీసీ నస్పూర్, జూన్ 27 : శ్రీరాంపూర్ ఏరియాలోని పలు కాలనీల్లో సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్బాబు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నస్పూర్, గోదావరికాలనీ షిర్కె, ఆర్కే-5, 6, కృష్ణకాలనీల్లో పర్యటించి, సివిల్ ఉద్యోగులు, సూపర్వైజర్లతో మాట్లాడారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్మిక కుటుంబాల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదన్నారు. ఆయన వెంట ఎస్వోటూఖ జీఎం త్యాగరాజు, సివిల్ క్వాలిటీ డీజీఎం నాగేశ్వర్రావు, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, సివిల్ ఇన్చార్జి డీజీఎం శ్రీధర్ తదితరులు ఉన్నారు.
భూపాలపల్లి ఏరియాలో..
కృష్ణకాలనీ, జూన్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో ఏరియా అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల పంపిణీ నిర్వహించారు. ఇన్చార్జి జీఎం బీవీ రమణ ముఖ్య అతిథిగా హాజరై, సింగరేణి పాఠశాల విద్యార్థులు, సింగరేణి కుటుంబాలకు సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ నార సంచులు వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులు, కార్మికులకు బీవీ రమణ సూచించారు. కార్యక్రమంలో ఏరి యా ఎస్వోటూ జీఎం విజయ్ ప్రసాద్, ఏజీఎంలు రామలిం గం, జ్యోతి, పీఎం శివకేశవరావు, ఫైనాన్స్ మేనేజర్ అనురాధ, ఐటీ మేనేజర్ రజనీకుమారి, ఎన్విరాన్మెంట్ అధికారి కృష్ణప్రసాద్, పీవో శ్యామ్ప్రసాద్, సేవా సెక్రటరీ లక్ష్మి, సీనియర్ సేవా సభ్యులు అరుణ, కవిత, సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవితేజ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.