కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :‘మన ఊరు.. మన బడి’ కింద మౌలిక సదుపాయల కల్పనే కాదు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలన్న లక్షలాది మంది తల్లిదండ్రుల కలలు నెరవేరే సమయం ఆసన్నం కాగా.. అన్నింటికీ మించి ప్రైవేట్ ఆర్థిక భారం నుంచి బతికి బయట పడుతామన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ప్రవేశ పెట్టకపోతే.. బడుల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముందంటున్నారు ఉపాధ్యాయులు. ఇంకోవైపు విద్యార్థులకు ఆంగ్లం రాకపోతే భవిష్యత్తులో తిప్పలు తప్పవని, ఎంత చదువుకున్నా పోటీ ప్రపంచంలో నిలువడం కష్టమని చెబుతున్నారు విద్యావేత్తలు. మొత్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తుండగా.. సర్కారు బడులకు పునర్జీవం పోసినట్లు అవుతుందంటున్నారు మేధావులు.
ఇదీ ఉపాధ్యాయుల మాట
ఇదీ మేధావుల సూచన..
ఇవీ ప్రయోజనాలు..
ఇంగ్లిష్ మీడియం లేకే మూతపడ్డది..
ఈ ఊరి స్కూల్లో ఆంగ్లమాధ్యమం లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించారు. దీంతో ఇక్కడి పాఠశాల మూతపడ్డది. అయితే గ్రామ ప్రముఖులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కష్టపడి బడిని తెరిపించారు. విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందిస్తున్నారు. సర్పంచ్, ప్రజాప్రతినిధులు బాగా సహకరిస్తున్నారు. సౌకర్యాల కల్పనకు దాతలు చేయూత నందించారు. ఇన్ని చేసినా ఇంగ్లిష్లో బోధిస్తేనే పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటున్నారు.
-త్రిదండపాణి సురేందర్కుమార్, హెచ్ఎం, బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్ఎస్
పక్క ఊర్ల నుంచి పిల్లలు వస్తున్నరు..
మా ఊరి బడిలో తెలుగు మీడియం ఉన్నన్ని రోజులు ఎవ్వరూ పట్టించుకోలె..పిల్లలు లేక సార్లు ఖాళీగా కూర్చుండేది. ఇప్పుడు ఆంగ్ల విద్య అందిస్తుండడంతో బడి కళకళలాడుతున్నది. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించడం మాన్పించి ఊరిలోని స్కూల్కే పంపుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి చదువుకొనేందుకు వస్తున్నారు. దాతలు కూడా పాఠశాల అభివృద్ధికి గొప్ప మనుసుతో సహకరిస్తున్నారు.
-పడాల రామరాజు, బ్రాహ్మణపల్లి ఎస్ఎంసీ చైర్మన్
సీఎం సారు ఆలోచన గొప్పది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టాలని సీఎం సారు చెప్పడం సంతోషంగా ఉన్నది. ఇన్నాళ్లూ ప్రైవేట్ బడులకు వెళ్లలేక బాధపడ్డం. ఇప్పుడు ఈ స్కూళ్ల హాయిగా చదువుకుంటున్నం. సార్లు గూడా చక్కగా చెబుతున్నారు. అర్థం కాకుంటే మళ్లామళ్లా రిపీట్ చేస్తున్నారు. బాగా చదువుకొని మంచిగా సెటిలై తల్లిదండ్రుల పేరు నిలబెడుత.
-పిడుగు అభిషేక్, 9వ తరగతి విద్యార్థి (బ్రాహ్మణపల్లి)