Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 1 : పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు, తహసీల్దార్ రాపెల్లి రాముడు, తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగు రవి మాట్లాడారు. సీపీఎస్ రద్దుచేసి, ఓపీఎస్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న ఆరు డీఏ లను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని, వివిద కారణాలతో నిలిచిపోయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్య పద్దతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్కుమార్, ఆర్ఏలు వినోద్, రాజేశ్, జీపీవోలు, ఎంపీస్వో శ్రీవాణి, ఉద్యోగులు యాసిన్, మహేందర్, సందీప్, శ్రీధర్, భాగ్యలక్ష్మి, రమ్య, కిరణ్, రమ, శ్రీకాంత్, సంపత్, శ్రీనివాస్, అశోక్, సతీశ్, సునీల్, మంజుల, షాబోద్దీన్, తాజ్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.