Electricity employees | ముకరంపుర, జులై 28 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు అప్పగించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో (టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన కొనసాగుతోంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మంగళవారం ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారావు, మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, సంతోష్, రంగు వెంకటనారాయణ, యుగంధర్, శ్రీమతి, రాచకొండ శ్రీనివాస్, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.