ముకరంపుర, జులై 15 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న మేనేజ్ మెంట్ మొండి వైఖరితో వ్యవహరిస్తూ టెండర్లను రద్దు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు సంపత్ రావు, సంతోష్, రాచకొండ శ్రీనివాస్, రంగు వెంకటనారాయణ, కిరణ్, శ్రీమతి, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.