ఓదెల, నవంబర్ 23: చెయ్యికి ఓటస్తే ఉచిత కరెంట్ పోయి ఉత్త కరెంటే దిక్కవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఉద్ఘాటించారు. ‘హస్తంపార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగం కావద్దు..చేసిన అభివృద్ధి, అందిన పథకాలను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలి.’ అని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. గు రువారం ఓదెల మండలం గుంపుల, భీమరిప ల్లి, కొమిరె, అబ్బిడిపల్లి, నాంసానిపల్లిలో, గోపరపల్లి, హరిపురం గ్రామాల్లో గురువారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు పూలమాలలు, మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ 2014 కంటే ముందు, తర్వాత గ్రా మాలు ఏట్లా అభివృద్ధి చెందాయో గమనించాలని ప్రజలను కోరారు.
గతంలో గ్రామాల్లో మౌ లిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడ్డ వి షయం మరవద్దున్నారు. బీఆర్ఎస్ అధికారం లో వచ్చిన తర్వాతే రాష్ట్రం, పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగినట్లు వివరించారు. నిరుపేదల అభ్యున్నతికి కల్యాణ ల క్ష్మి, ఆసరా పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పం పిణీ, కుల సంఘాలకు నిధులు ఇచ్చి ఆదుకున్న ది సీఎం కేసీఆరేనని వివరించారు. పెద్దపల్లి ని యోజకవర్గంలో కూడా గ్రామాలకు లింకు రో డ్లు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మ ళ్లీ వస్తే మరింత అభివృద్ధితో పాటు పేదలకు అనే క రకాల సంక్షేమ పథకాలు అమలు జరగనున్న ట్లు తెలియజేశారు.
రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి ద్వారా పేద మహిళలకు రూ. 3 వేలు, రైతు బంధు, పింఛన్లు పెరుగుతాయని చె ప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. గుంపుల, నాంసానిప ల్లి, భీమరిపల్లిలో పలువురు యువకులు ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, జడ్పీటీసీ గంట రాములు, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ప్యాక్స్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఆకుల మహేందర్, ఏఎంసీ డైరెక్టర్ అమ్ముల భిక్షపతి,
మ్యాడగోని శ్రీకాంత్, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ నేత నల్ల మనోహర్రెడ్డి, సర్పంచ్లు తిప్పారపు చిరంజీవి, కల్లెపల్లి సరిత- రవి, ఒజ్జె కోమలత-శ్రీనివాస్, పో తుగంటి రమ- రాజుగౌడ్, కర్క మల్లారెడ్డి, గుండేటి మధు, ఎంపీటీసీ ఐరెడ్డి సరోజన- కిషన్రెడ్డి, నాయకులు ఉప్పుల సంపత్కుమార్, మడ్డి శ్రీనివాస్గౌడ్, రాజుల కిషన్, భీమరి న ర్సయ్య, రాపర్తి మల్లేశ్గౌడ్, మాట్ల రాజయ్య, చదువు శ్రీనివాస్రెడ్డి, పల్కల నర్సింహరెడ్డి, శనవేన మొండయ్య, గంగిశెట్టి ప్రభాకర్, వీరవేని నాగరాజు, నేదురు మహేష్, తంగెళ్ల రాజు పోలపెల్లి బుచ్చిరెడ్డి, జంగ రాజిరెడ్డి, మద్దనవేని రవి, కాశవేని నరేష్, కర్ర మహేందర్రెడ్డి, రాకేష్ పాల్గొన్నారు.