Odela | ఓదెల, జూన్ 23 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రజక సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పైడిపల్లి రమేష్, ఉపాధ్యక్షుడిగా శాతాల విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సంఘాన్ని అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హామీని ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు సన్మానించి అభినందించారు.