కరీంనగర్ కమాన్ చౌరస్తా, జూన్ 24 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో అత్యుత్తమ బోధన అందుతున్నది. కరీంనగర్తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన అందుతుండగా, స్థానిక యువలో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక ఇక్కడి పాఠశాలల్లో ఆటపాటలతోపాటు బప్రాముఖ్యమైన రోజులు, పండుగులు విద్యార్థులకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పలు పాఠశాలల్లో అకాడమిక్ సెలబస్లో భాగంగా విద్యార్థులను ఫీల్డ్కు తీసుకెళ్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్లు, దవాఖానలు, పోలీస్ స్టేషన్ల గురించి అవగాహన కల్పిస్తున్నారు. చదువుతోపాటు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ పోటీ ప్రపంచంలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నారు.