సిరిసిల్ల, ఫిబ్రవరి 25: రేషన్కార్డుల ఈ-కేవైసీ గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పౌరసరాఫరాల అధికారి జితేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ కోసం అప్ప టి ప్రభుత్వం ఈ కేవైసీ(రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం) ప్రక్రియను చేపట్టింది. ఇందుకు జనవరి 31 వరకు గడువు విధించింది.
రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ రేషన్ షాపులకు వెళ్లి ఈ పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. మరణించిన వారు, పెండ్లి చేసుకున్నవారు, ఉద్యోగాలు పొందిన వారి పేర్లు రేషన్కార్డుల్లోంచి తొలగించలేదు. దీంతో బియ్యం కోటాను సవరించలేదు. ప్రతినెలా బియ్యం మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను చేపట్టింది. జిల్లాలో ఇప్పటికే 80 శాతం నమోదు పూర్తయిందని అధికారులు తెలిపారు. మొత్తం 343 రేషన్ దుకాణాలు, 1.73 లక్షల రేషన్ కార్డులు, సుమారు 5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది ఈ కేవైసీ చేయించుకున్నారు.