రామడుగు, జనవరి 30: ఆయిల్పామ్ సాగు చేసే రైతాంగానికి సర్కారు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మం డలంలోని వెదిరలో గ్రామానికి చెందిన రైతు కొయ్యెడ శ్రీధర్ మూడెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుతో కొత్త హరిత విప్లవాన్ని తేనుందన్నారు. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యా మలమైందన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పం టలను సాగు చేయాలని సూచించారు.
తెలంగా ణ ప్రాంతం అన్ని వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉంటుదనీ, పంటమార్పిడితో భూ సారం పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు రాయితీపై మొక్కలను అందజేస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి మొదలయ్యే నాలు గేండ్ల వరకు రైతులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అంది స్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయంతో ప్రస్తుతం రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామన్నారు. వెదిరలో ఆయిల్ఫామ్ సాగు చేపట్టిన రైతు కొయ్యెడ శ్రీధర్ను ఎమ్మెల్యే అభినందించా రు. ఏవో యాస్మిన్, ఏఈవోలు సంప త్, రమేశ్, వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు కొడిమ్యాల రా జేశం, శనిగరపు అనిల్కుమార్, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ దొడ్డ లచ్చిరెడ్డి ఉన్నారు.