ఇల్లంతకుంట, అక్టోబర్ 11: అభివృద్ధిని చూసి ఓటెయ్యండని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. బుధవారం గాలిపెల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద సభకు హాజరైన ఆయనకు బతుకమ్మలు, బోనాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు పథకాలను ప్రచారం చేస్తూ, ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మోసాలతో కూడుకున్నదని మండిపడ్డారు. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజలకు నిరంతరం అండగా ఉంటున్నదన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు పాల్గొన్నారు.