మంథని, జనవరి 25 : ‘ప్రభుత్వం పారదర్శకంగా గ్రామసభలో ఎంపిక చేసి పేదలకు డ బుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేకే మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నడు’ అంటూ పెద్దపల్లి జిల్లా మంథని పోచమ్మవాడ డబుల్బెడ్రూం లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులవెరో చెప్పాలంటూ నిలదీశారు. బుధవారం వారు మంథని ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడా రు. గ్రామసభ నిర్వహించి పారదర్శకంగా 92 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని గుర్తుచేశారు. అప్పుడు మిన్నకుండిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నాయకులు.. ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీవోలకు ఎందుకు ఫిర్యాదు చేశారం టూ ప్రశ్నించారు.
అనర్హులంటూ పేదల పొట్టకొట్టేందుకు యత్నిస్తున్నారని విరుచుకుపడ్డా రు. దమ్ముంటే నిరూపించాలని సవాల్విసిరా రు. పేదల ఇండ్లకు అడ్డుపడవద్దన్నారు. మా బాధలను గుర్తించి ఇండ్లు ఇప్పించిన పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధుపై ఆరోపణలకు దిగడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. కూలీనాలి చేసుకుంటూ బతికే తమకు ఇండ్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ను బద్నాంచేసేందుకే కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లను అడ్డుకుంటే పుట్టగతులులేకుండా పోతారని తూర్పారబట్టారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవుచెప్పారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు.
పింఛన్తోనే బతుకుతున్నం..
మేం భార్య భర్తలిద్దరం వికలాంగులమే.. నెలనెలా వచ్చే పింఛనే మాకు జీవనాధారం. ఇది గుర్తించే ప్రభుత్వం ద్వారా పుట్ట మధు డ బుల్బెడ్రూం ఇల్లు ఇప్పించిండు. మాలాం టి లబ్ధిదారులపై మంథని ఎమ్మె ల్యే శ్రీధర్బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నడు. ఆయన మాకు చేసిందేమీ లేదు.. కానీ ఇప్పుడు అన్యాయం చేసేందుకు కుట్ర జేత్తున్నడు.
–కుడుదుల భిక్షపతి-చంద్రకళ (మంథని)