మేడిపల్లి, ఏప్రిల్ 22 : జిల్లాలో శనివారం సా యంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కల్వకోట, దమ్మన్నపేట, భీమారం మం డలంలోని మన్నెగూడెం, లింగంపేట, దేశాయిపేట, రాజలింగంపేట, గోవిందారం, పసునూ ర్, మోత్కురావుపేట గ్రామాల్లో రోడ్లపై చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోతకు వచ్చిన వరి పంటలో వడ్లు రాలిపోయాయి. మామిడి తోట ల్లో కాయలు నేలరాలాయి.
మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 22 : మండలంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సానికి అన్నదాతలు అతలాకుతలమయ్యారు. ఒక్కసారిగా బలమై న గాలులు వీస్తూ వర్షం కురువడంతో పలు గ్రామా ల్లో నువ్వు పంట నేలవాలింది. అలాగే మామిడి కాయలు నేలరాలాయి. చౌలమద్దిలోని సహకార సంఘం గోదాం పైకప్పు రేకులు లేచిపోయాయి.
కోరుట్ల రూరల్, ఏప్రిల్ 22 : కోరుట్ల మండలంలోని పైడిమడుగు, కల్లూరు, ఐలాపూర్, జోగన్పెల్లి తదితర గ్రామాల్లో ఈదురు గాలుతో కురిసిన రాళ్లవానకు నువ్వు పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షంతో నువ్వు పంట నేలవాలడంతో పాటు వరిధాన్యం తడవడంతో రైతులు తమను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
కథలాపూర్, ఏప్రిల్ 22 : మండలంలో వడగం డ్ల వర్షం ఈదురుగాలులు వీయడంతో రైతులకు తీవ్రనష్టం జరిగింది. తాండ్య్రాల, గంభీర్పూర్ గ్రామాల్లో వడగండ్ల వర్షం కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరిధాన్యం కుప్పలు తడిసిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిరికొండ, భూషణరావుపేట గ్రామాల్లో ఈదురుగాలులు వీయడంతో మామిడికాయలు నేలరాలినట్లు రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధా న్యం కుప్పలపై ఉన్న టార్ఫాలిన్ కవర్లు కొట్టుకుపోయాయని రైతులు పేర్కొన్నారు.
రాయికల్, ఏప్రిల్ 22 : పట్టణంలో వడగండ్ల వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు ఈదు రు గాలులతో కూడిన వర్షం పడడంతో పలుచోట్ల పంటల నష్టం జరిగింది.
కొడిమ్యాల, ఏప్రిల్ 22 : సూరంపేట, కోనాపూ ర్, తిర్మలాపూర్, శనివారంపేట, హిమ్మత్రావుపేట, డబ్బుతిమ్మాయపల్లి, నాచుపల్లి, చింతలపల్లి గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో వరి పంట నేలవాలింది. కొంత మంది రైతు లు ఆరబోసిన ధాన్యం తడిచింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోనాపూర్ సర్పంచ్ చెక్కపల్లి స్వామిరెడ్డి కోరుతున్నారు.
మల్యాల, ఏప్రిల్ 22 : మల్యాల మండలంలోని మద్దుట్ల, కొడిమ్యాల మండలంలోని రాంసాగర్ గ్రామాల మధ్య సరిహద్దులో భారీ ఈదురు గాలులకు వరిపంటతోపాటు మామిడితోటల్లోని కాయ లు నేలరాలాయి. అదేవిధంగా గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం సైతం తడిసి ముద్దయింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా వెంటనే ఆదుకోవాలని మద్దుట్ల సర్పంచ్ కెల్లేటి మల్లమ్మ కోరారు.
కొడిమ్యాల, ఏప్రిల్ 22 : సూరంపేట, కోనాపూర్, తిర్మలాపూర్, శనివారంపేట, హిమ్మత్రావుపేట, డబ్బుతిమ్మాయపల్లి, నాచుపల్లి, చింతలపల్లి గ్రామాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వరి పంట నేలవాలింది. కొంత మంది రైతులు ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబోయగా తడిసింది.
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు మరమ్మతులు చేపట్టిన అధికారులు
మెట్పల్లి, ఏప్రిల్ 22 : ఈదురుగాలులతో శనివారం సాయంత్రం మెట్పల్లి పట్టణంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో పలు విద్యుత్ స్తంభాలు, వివిధ చోట్ల వ్యాపార, వాణిజ్య ప్రకటనల బోర్డులు నేలకొరిగాయి. 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో, అదే విధంగా వివిధ కాలనీలో పలు స్తంభాలు నేలకొరగడంతో పెను ప్రమాదం తప్పగా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను విద్యుత్ సిబ్బంది అదే రోజు రాత్రి లోపు సరిచేసి పలు కాలనీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.