చిగురుమామిడి, జనవరి 25: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఆయన 70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 41 మందికి సీఎంఆర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతుల జీవితాలు మారిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ జకుల రవి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ మిట్టపల్లి మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
మండల పరిషత్ కార్యాలయ ఆడిటోరియంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సతీశ్కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పైపులైన్ లీకేజీలు, తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ, జడ్పీటీసీ,ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.