ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 8: తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణను అన్నింటా అగ్రగామిగా నిలిపారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమా ర్ కొనియాడారు. చేసిన అభివృద్ధి పనులు, అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రభుత్వా న్ని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ పాలనలో సాకారమవుతున్నాయని చెప్పారు. బృహత్తరమై కాశేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. ఆదివా రం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల్లో పర్యటించారు.
ఆయాచోట్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రా వు, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్యతో కలిసి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సిరిసిల్ల సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 120 మంది మైనార్టీ లబ్ధిదారులకు రూ. లక్ష సాయం చెక్కులు, ముస్తాబాద్ రైతు వేదికలో 58 మందికి కల్యాణలక్ష్మి, 420 మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను పంపి ణీ చేశారు. ఎల్లారెడ్డి మండలం ఆగ్రహారంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మునిగే అమృతను చైర్లో కూర్చోబెట్టి అభినందించారు.
ఆయాచోట్ల వినోద్ మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తు న్న పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి విప్లవాత్మక పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యం, నిరుపేద పిల్లలకు వైద్య విద్య అందిం చే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మహిళలు ప్రభుత్వ ఫలాలను అందిపుచ్చుకొని అన్ని రంగా ల్లో రాణించాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. త్వరలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.