ధర్మారం, అక్టోబర్ 29: ‘నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు అండగా ఉంట..రాజకీయంగా తన ఉన్నతికి సహకరిస్తున్న వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తా’ అని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్ ప్రకటించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో ధర్మారం మండలాన్ని అభివృద్ధి చేసిన. మళ్లీ గెలిపిస్తే మౌలిక వసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ అది చే స్తాం..ఇది చేస్తాం..అంటూ ఆపద మొక్కులతో ప్ర జల ముందుకు వచ్చే కాంగ్రెసోళ్లను నమ్మవద్దని సూచించారు.
వారిని నమ్మితే నిండా ముంచుతరని హెచ్చరించారు. ఇందుకు కర్ణాటకలోని దౌ ర్భాగ్య పరిస్థితులే నిదర్శనమని చెప్పారు. ఆదివా రం ధర్మారంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించి న వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మా ట్లాడారు. సీఎం కేసీఆర్ తొమ్మిదన్నరేండ్ల పాలనలో వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చి పేదల బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు. బీసీబంధు, దళితబంధు, మైనార్టీ బంధు లాంటి పథకాలతో అణగారినవర్గాలు, వృత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగం గోస తీర్చారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. వ్యాపారులు అభివృద్ధిని చూసి కేసీఆర్కు హ్యాట్రిక్ సీఎం గా చేయాలని పిలుపునిచ్చారు. 2026లో ధర్మా రం ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నదని, దీంతో ధర్మారం మరింత అభివృ ద్ధి చెందే పరిస్థితి ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తనను ఆదరించాలని కోరారు. వచ్చే నెల 30న కారు గుర్తుకు ఓటేసి దీవించాలని అర్థించారు. మళ్లీ గెలిపిస్తే వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తానని, రూ. కోటి వెచ్చించి బస్టాండ్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీడీవో ఆఫీసు ఎదుట గల క్రీడా స్థలాన్ని అభివృద్ధి చేసి మినీ స్టేడియంగా తీర్చిదిద్దానని, ఇకడ యోగా భవనం, జిమ్, వాకింగ్ చేసుకోవడానికి సౌకర్యం, వ్యాపారులు కోరినట్లుగా సులభ కాం ప్లెక్స్ నిర్మాణం, అద్దె భారాన్ని తగ్గించడానికి ఖా ళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అద్దె షెటర్లనిర్మాణం, సమీకృత వార సంత ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశా రు. సమావేశానికి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతిరావు అధ్యక్షత వహించగా జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎం పీపీ మేడవేని తిరుపతి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు పూ స్కూరు రామారావు, ధర్మపురి ఆలయ బోర్డు సభ్యుడు జైన రాజమౌళి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, గుర్రం మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, కోఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫి, ఉప సర్పంచు ఆవుల లత పాల్గొన్నారు.