వేములవాడ టౌన్, జూన్ 6 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది తరలిరాగా ఉదయం నుంచే క్యూలైన్లో బారులుతీరారు.
స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జితసేవలను రద్దుచేశారు. ఆలయ పార్కింగ్ స్థలంలో దాదాపు 3 వేల వాహనాలు నిలిపి ఉంచగా, ఒక్కరోజే సుమారు 26 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.