వేములవాడ టౌన్, ఫిబ్రవరి 13: వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు శివసత్తుల నృత్యాల నడుమ నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. క్యూలో గుండా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
కల్లుపోసి సారెపెట్టి బోనం సమర్పించారు. ఇంటిల్లిపాదిని సల్లంగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు హరిహరనాథ్ ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.