విద్యానగర్, ఏప్రిల్ 27: తపాల శాఖ ఆసరా పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. పోస్టాఫీసులో ఎలాంటి ఫీజు లే కుండా ఉచితంగా రూ.పదివేల వరకు తీసుకునే అవకాశం కల్పించింది. ఆసరా పెన్షన్ చెల్లించేందుకు తపాలా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై వెంకటేశ్వర్లు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను విడుదల చేసిందని, కరీంనగర్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగుల, చేనేత, గీత కార్మికులకు ఆసరా పెన్షన్ల చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు.
ఆధార్ కార్డ్ నంబర్ తీసుకుని వెళ్తే మీ బ్యాంక్లో జమ చేయబడిన పెన్షన్ మొత్తాన్ని మీ సమీపంలోని పోస్టాఫీసు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని పేరొన్నారు. పంచాయతీల్లో పోస్టాఫీసు సిబ్బంది పెన్షన్ చెల్లింపులు చేస్తారని, ఒకవేళ పెన్షన్ దారుడి వేలిముద్ర పడకపోతే పంచాయతీ కార్యదర్శి వేలిముద్ర ద్వారా కూడా నగదు తీసుకోవచ్చని తెలిపారు. కరీంనగర్ డివిజన్ పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2 హెచ్ఓలు, 52 సబ్ పోస్టాఫీసులు, 389 పోస్టాఫీసులు ఉన్నాయ ని వివరించారు. పోస్టాఫీసులలో ఐపీపీబీ ఏఈపీఎస్ సౌకర్యం ద్వారా ఏదైనా బ్యాంక్ ఖాతా నుంచి నగదు తీసుకోవచ్చని, వారంపాటు పెన్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈఅవకా శాన్ని పెన్షన్దారులు వినియోగించుకోవాలని పోస్టల్ సూపరింటెండెంట్ కోరారు.