హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి5: నియోజకవర్గంలోని దళితబంధు పథకం లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న రెండో విడుత డబ్బులు వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడుత దళిత బంధు డబ్బులు రాకపోవడంతో ఇటీవల వీణవంక, జమ్మికుంటకు చెందిన గాజుల అమల, శ్రీనివాస్ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, సోమవారం వారికి హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే సానుభూతిని ప్రకటించారు.
ప్రభుత్వం దళితబంధు అమలులో జాప్యం చేస్తే హుజూరాబాద్తో పాటు రాష్ట్రంలోని దళిత కుటుంబాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. లబ్ధిదారులు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ తాను అండగా ఉండి రెండో విడుత డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తానని కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు.