పెగడపల్లి, అక్టోబర్ 16: బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తున్నదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలుచేస్తున్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, 100 సీట్లలో గెలిచి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని దీ మా వ్యక్తం చేశారు. సోమవారం పెగడపల్లి మం డల కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అ నంతరం మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో గొప్పవారని, తెలంగాణ పునర్నిర్మాణంలో నిస్వార్థంగా పని చేశారని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అద్భుతమని, దేశంలో ఏ నాయకుడు ఇ లా ప్రజల కోసం పనిచేయడని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మచ్చలేని నాయకుడని, ధర్మపురి రారాజుగా ఈశ్వర్ను స్వయాన మంత్రి కేటీఆర్ అభివర్ణించారని, అలాంటి నా యకుడు దొరకడం ప్రజల అదృష్టమన్నారు. వ చ్చే ఎన్నికల్లో 70 వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వర్ ఘన విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశా రు. బీఆర్ఎస్ పటిష్టత, గెలుపు కోసం అందరూ సమన్వయంతో పని చేయాలని సూచిస్తూ, పార్టీ శ్రేణులతో ప్రమాణం చేయించారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ స ర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఏ డాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందని, గ్యాస్ సిలిండర్ ధర పెంచి సామాన్యుల నడ్డివిరిచిందని దుయ్యబట్టారు.
ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారని, నాడు ఏండ్లకొద్ది అధికారం లో ఉన్నది వారే కదా..? అని చెప్పిన ఆమె, అ ప్పుడు పనులు చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా..? అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ పార్టీ రాష్ట్ర నేత వోరుగంటి రమణారావు, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, ఎంపీపీ గోళి శోభ-సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, విండో చైర్మన్లు కర్ర భాస్కర్రెడ్డి, మంత్రి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.