దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్
కొత్తపల్లిలో యూనిట్ ప్రారంభం
జమ్మికుంట రూరల్, మే 25: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని ధర్మారం గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారు మారెపల్లి శారద కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్మి ఎలక్ట్రికల్ వైండింగ్ వర్క్షాపును బుధవారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు.
సౌకర్యాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వార్డు కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, భిక్షపతి తదితరులున్నారు. అలాగే మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారు రాచపల్లి నగేశ్కు మంజూరైన జేసీబీని జిల్లా కేంద్రంలో ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు ప్రారంభించారు.
జమ్మికుంట పట్టణంలో..
పట్టణానికి చెందిన దళితబంధు లబ్ధిదారు వంతడుపుల కుమార్కు మంజూరైన హోండా అమేజ్ కారు, అలాగే తిరుపతి అనే లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న దేవిక ఆయిల్ డిపోను మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ప్రారంభించారు. అలాగే ఇల్లందకుంట మండల కేంద్రంలో గుంపుల కౌసల్యకు చెందిన పవనసుత బిర్యానీ సెంటర్ను ప్రారంభించి, లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్తో పాటు తదితరులు ఉన్నారు.
దళితులు ధనికులు కావాలి
హుజూరాబాద్ టౌన్, మే 25: దళిత బంధుతో దళితులు ధనికులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక ఆకాంక్షించారు. హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్రోడ్లో దళిత బంధు పథకం లబ్ధిదారు బుచ్చమ్మ ఏర్పాటు చేసుకున్న విజయ్ సూపర్ మార్కెట్ను బుధవారం వార్డు కౌన్సిలర్ మారెపల్లి సుశీలతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారును అతిథులు, వారిని లబ్ధిదారు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పలపల్లిలో..
వీణవంక, మే 25: ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సంకినపల్లి నిర్మల-శంకరయ్యకు దళితబంధు కింద సెంట్రింగ్ షాప్ మంజూరు కాగా, బుధవారం సింగిల్విండో డైరెక్టర్ ముదుగంటి శ్యాంసుందర్రెడ్డి, ఎంపీటీసీ ఎలవేన సవిత-మల్లయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కర్ణాల రాజేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు మందల సమ్మిరెడ్డి, తాండ్ర శంకర్, ఎం నర్సింహారెడ్డి, కొయ్యడ మొగిలి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, మే 25: పాతర్లపల్లి గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు సరితాసమ్మయ్య, లక్ష్మీశంకర్, నీరజాఐలయ్యకు సంయుక్తంగా హార్వెస్టర్ మంజూరు కాగా, మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో బుధవారం ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులు ఎంపీటీసీని శాలువాలతో సన్మానించారు. ఇక్కడ టీఆర్ఎస్ గ్రామ నాయకులు ఉన్నారు.