తెలంగాణ చౌక్, నవంబర్ 30: ప్రాథమిక దశలోనే విద్యార్థులు సైబర్ నేరాలను అరికట్టాలని డీఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైబర్ కాంగ్రెస్ కార్యక్రమానికి ఎస్పీ రాహుల్హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సైబర్ నేరాలు, బాలికల సంరక్షణలో షీ టీం పాత్ర గురించి అవహగాహన కలి గి ఉండాలన్నారు. మొబైల్తో జరిగే ఆర్థిక నేరా ల విధానాలు, అనవసరమైన యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే వచ్చే నష్టాల గురించి వివరించారు. నేరాలకు గురైనప్పుడు వెంటనే 155260 ట్రోల్ ఫ్రీ నంబర్కు గానీ, డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలో ఏడుగురు విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా నియమించినట్లు తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే 79011-32113 నంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ మెస్సేజ్ ద్వారా సమాచారం అందజేయాలని షీ టీం ఏఎస్ఐ ప్రమీల సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇక్కడ హెచ్ఎం పరబ్రహ్మ మూ ర్తి, సైబర్ మెంటర్ టీచర్ పాకాల శంకర్గౌడ్, కానిస్టేబుల్ శం కర్, ఉపాధ్యాయుడు పురుషోత్తం తదితరులు ఉన్నారు.