జగిత్యాల టౌన్, ఏప్రిల్ 25 : వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షాలకు జిల్లాలో 42,774 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవగా, 32 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లగా, వరి పంట 7,663 ఎకరాల్లో, మొక్కజొన్న 199, నువ్వు 2190 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈదురు గాలులతో పంట నష్టంతో పాటు మామిడి కొమ్మలు, చెట్లు విరిగిపడి మరింత నష్టం వాటిల్లింది. మరోవైపు పంట పొలాల్లోకి నీరు చేరడంతో వరి కోతలు నిలిచిపోయాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా రైస్ మిల్లల్లు కొనుగోలును ఆపివేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ను కోరగా వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. ఇదే విధంగా మరి కొన్ని రోజులు అకాల వర్షాలు కొనసాగినట్లయితే చేతికి వచ్చే వరి, నువ్వు పంటలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
మార్చి నెల 25 నుంచి ఏప్రిల్ 23 వరకు పంట నష్టం వివరాలు
జిల్లాలో మార్చి 25, 26 తేదీల్లో కురిసిన అకాల వర్షానికి కథలాపూర్ మండలంలో వరి 657 ఎకరాల్లో, నువ్వు 61, మామిడి 44 ఎకరాల్లో, ధర్మపురి మండలంలో వరి 91, మొక్కజొన్న 3, నువ్వు 17, జగిత్యాల అర్భన్ మొక్కజొన్న 23, గొల్లపల్లి మండలంలో మొక్కజొన్న 76 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ నెల 5న కురిసిన అకాల వర్షానికి కొడిమ్యాల మండలంలో వరి 95 ఎకరాల్లో , మామిడి 58 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
ఈ నెల 20వ తేదీన కురిసిన అకాల వర్షంతో గొల్లపల్లి మండలంలో మొక్కజొన్న 7 ఎకరాల్లో, ఎండపల్లిలో వరి 35 ఎకరాల్లో, మొక్కజొన్న 38, మేడిపల్లి మండలంలో నువ్వు 21 ఎకరాల్లో, మామిడి 3765 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో నువ్వు 340, మామిడి 375, కోరుట్ల మండలంలో వరి 20, నువ్వు 168, మామిడి 3352, మల్లాపూర్ మండలంలో వరి 25, నువ్వు 681, మామిడి 2505, మెట్పల్లి మండలంలో నువ్వు 213, మామిడి 927, మల్యాల మండలంలో మామిడి 2677, కొడిమ్యాల మండలంలో మామిడి 40, జగిత్యాల రూరల్ మండలంలో మామిడి 2162, జగిత్యాల అర్భన్ మండలంలో మామిడి 72, రాయికల్ మండలంలో మామిడి 7247, సారంగాపూర్ మండలంలో మామిడి 185, బీర్పూర్ మండలంలో మామిడి 195 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ నెల 22వ తేదీన కురిసిన అకాల వర్షాలకు మల్యాల మండలంలో వరి 270, నువ్వు 4, మామిడి 1450, కొడిమ్యాల మండలంలో వరి 2512, మామిడి 857, కోరుట్ల మండలంలో వరి 1646, నువ్వు 338, వెల్గటూర్ మండలంలో వరి 26, మొక్కజొన్న 3, నువ్వు 3, మామిడి 580, ఎండపల్లి మండలంలో వరి 74, మొక్కజొన్న 49, నువ్వు 6, మామిడి 230, గొల్లపల్లి మండలంలో నువ్వు 18, మామిడి 1850, మేడిపల్లి మండలంలో వరి 585, నువ్వు 66, జగిత్యాల అర్బన్ మండలంలో నువ్వు 6, రాయికల్ మండలంలో వరి 630, నువ్వు 123, బుగ్గారం మండలంలో మామిడి 410, ధర్మపురి మండలంలో మామిడి 560, పెగడపల్లి మండలంలో మామిడి 1900, కథలాపూర్ మండలంలో మామిడి 1277 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
ఈ నెల 23వ తేదీన కురిసిన అకాల వర్షానికి కథలాపూర్ మండలంలో వరి 817 ఎకరాల్లో, సారంగాపూర్ మండలంలో వరి 180, నువ్వు 80, జగిత్యాల రూరల్ మండలంలో నువ్వు 45 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.