కరీంనగర్ రాంనగర్, జూన్ 2: కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో జరిగిన దోపీడీకి సూత్రాధారి ది గోల్డెన్ థీఫ్ ముఠా నాయకుడైన సుభోద్సింగ్ను విచారించేందుకు కరీంనగర్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దోపీడీపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీస్శాఖ తమవంతుగా ప్రయత్నించి తొలుత మే 13న ముగ్గురిని అరెస్ట్ చేసింది.
అసలు సూత్రధారైన సుభోద్సింగ్ను మే 29న అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14రోజుల రిమాండ్ విధించింది. దోపీడీలో దోచుకున్న 161.4 బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను ఎవరి ద్వారా ఎక్కడికి పంపించారు అనే అంశంపై పోలీసులు విచారించనున్నారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్పై విచారించిన కోర్టు ఈ నెల 3న ఉదయం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు అనుమతి ఇచ్చింది.