వీణవంక, జూన్ 15: అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి మండలి విప్ పాడి కౌశిక్రెడ్డితో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామస్తులతో కలిసి బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు బతుకమ్మలతో ర్యాలీ తీశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు.
సర్పంచ్ పోతుల నర్సయ్య జాతీయ జెండాను ఆవిష్కరించగా జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న సపాయన్నలకు సలాం అని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు యూనిట్లు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడడానికి మహారాష్ట్ర నుంచి ఇటీవల 25 మంది సర్పంచులు వచ్చారని, వారు స్వయంగా పరిశీలించి సీఎం కేసీఆర్ దేశానికి పీఎం కావాలని కోరుకున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మండల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని రెడ్డిపల్లిలో కూడా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.2 వందల కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన దుస్తులను, సామగ్రిని పారిశుధ్య కార్మికులకు అందజేసి, వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఎంపీటీసీ ఒడ్డెపెల్లి లక్ష్మీభూమయ్య, సింగిల్విండో డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు అడిగొప్పుల సత్యనారాయణ, సురేశ్, చింతల రాజు, శ్రీనివాస్, రాజయ్య, చింతల సుమన్, చరణ్, కొండల్రెడ్డి, జీ రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు.