జమ్మికుంట మార్కెట్లో రికార్డు ధర
క్వింటాల్కు రూ. 14వేలు
జమ్మికుంట, మే 17: ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చారు. గరిష్ఠ ధర రూ.14వేలు, మోడల్ ధర రూ.13వేలు, కనిష్ఠ ధర రూ.10,500తో వ్యాపారులు కొనుగోలు చేశారు.
కొనుగోళ్లను మా ర్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు, వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్, కార్యదర్శి జీ రెడ్డీనాయక్, సూపర్వైజర్ యాకయ్య పరిశీలించా రు. ఇక్కడ మార్కెట్ డైరెక్టర్లు, వ్యాపారులు, అడ్తిదారులు, గుమస్తాలు, రైతులు,సిబ్బంది ఉన్నారు.