రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడికి ఆద్యంతం కృతజ్ఞతలు చెబుతూ.. సేవలను కొనియాడింది. హుజూరాబాద్, జమ్మికుంటలో అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్, మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటు జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్రావు హాజరయ్యారు. అటు రాజధానిలో 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. ‘జై భీమ్.. జై అంబేద్కర్’ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కార్పొరేషన్, ఏప్రిల్ 14 : సమోన్నత విజ్ఞాన మూర్తి, సామాజిక సమానత్వ స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హుజూరాబాద్, జమ్మికుంటలో దళితబంధు పథకం యూనిట్లను పరిశీలించేందుకు వచ్చిన అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటు జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో నిర్వహించిన అధికారిక వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, శిక్షణ కలెక్టర్ నవీన్ నికోలస్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చల్ల హరిశంకర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పాల్గొన్నారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామడుగు, గంగాధర మండల కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపల్లిలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు నివాళులర్పించగా, మానకొండూర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, జిల్లాలోని అన్ని మండలాల్లో జయంతి ఉత్సవాలను నిర్వహించగా, ఆయాచోట్ల జై భీమ్ నినాదాలతో మార్మోగాయి.
రాజధాని హైదరాబాద్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలు దేరి వెళ్లారు. ఇందులో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తరలివెళ్లారు.