వేములవాడ, నవంబర్ 24: ప్రజాప్రతినిధు లు, పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికెళ్లి అభివృద్ధి, సంక్షేమం వివరించి ఓటు అడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేశ్బాబు, ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావుతో కలిసి శుక్రవారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని, వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వివరించి ఓట్లు అడగాలని కోరారు. కాంగ్రెస్ పాలన లో కరెంటు కష్టాలు, రైతులు పడ్డ ఇబ్బందులను గుర్తుచేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. కలిసికట్టుగా ఐదు రోజుల శ్రమించి బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు విజయానికి ప్రతిఒకరూ శ్రమించాలని కోరారు.
మన బలాన్ని మరోసారి చాటిచెబుదామన్నారు. సమావేశంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎంపీపీలు వజ్రమ్మ, బైరగోని లావణ్య, రేవతి, ఉమా రాణి, గంగం స్వ రూపారాణి, చంద్రయ్యగౌడ్, జడ్పీటీసీలు మ్యాక ల రవి, ఏశ వాణి, గట్ల మీనయ్య, నాగం భూమ య్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గోసుల రవి, మ్యాకల ఎల్లయ్య, మల్యాల దేవయ్య, కమలాకర్, సత్తిరెడ్డి గంగాప్రసాద్, సెస్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వేములవాడలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? మీ కండ్లకు అభివృద్ధి కనిపించకపోతే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలె. దేశంలో ఎకడాలేని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నయి. ఓట్ల కోసం ముసలి కన్నీరు కాస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ సంసృతి మాకు లేదు. వేములవాడ భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో భద్రంగా ఉంటుంది. ప్రతి ఒకరూ కారు గుర్తుకే ఓటేయండి. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. ]గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో నియోజకవర్గంలో 5వేల కోట్లతో సంక్షే మం, అభివృద్ధి పథకాలు అమలు చేసినం. 68 వేల ఎకరాలకు సాగునీరు, నియోజకవర్గంలో ప్రాజెక్టులు, రైతు సంక్షేమానికి 1,700కోట్లు, సంక్షేమ పథకాలకు 1,400కోట్లు, రహదారుల నిర్మాణానికి 450కోట్లు, ఆలయ అభివృద్ధికి 280కోట్లు, ముంపు గ్రామాలకు 300కోట్లు చెల్లించినం. వేములవాడ పట్టణానికి 214కోట్లు వెచ్చించినం. విద్యరంగానికి50 కోట్లు, వైద్యరంగానికి 35కోట్లు గ్రామీణాభివృద్ధికి 45 కోట్లు వెచ్చించినం. వేములవాడ గుడి చెరువులో 365 రోజులు నీళ్లు ఉండే విధంగా18కోట్లతో మధ్యమానేరు జలాశయం నుంచి లిఫ్ట్ చేసుకున్నం.
– చెన్నమనేని రమేశ్బాబు, ఎమ్మెల్యే (వేములవాడ)
తన గెలుపు కోసం ఈ నాలుగైదు రోజులు కష్టపడితే ఐదేండ్లపాటు మీ కష్టాల్లో పాలుపంచుకొని మీ వెన్నంటి ఉంటా. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. కారు జోరును ఎవరూ ఆపలేరు. క్షేత్రస్థాయిలో బలం మనకే ఉన్నది. కష్టపడి పని చేసి తన గెలుపునకు అందరూ సహకారం అందించాలె.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి