కరీంనగర్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ భూములకు భద్రత లేకుంటా పోతదని, తిరిగి గతంలో అనుభవించిన బాధలు మొదలవుతాయని జిల్లా రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో రోజులు కష్టపడి, అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి తమ భూములకు భద్రత కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు తమ భూములకు సంబంధించిన హక్కులు, అధికారాలు ప్రభుత్వం చేతిలో ఉండేవని, కొత్త చట్టం వచ్చిన తర్వాత ఏర్పడి ధరణి కారణంగా ఇప్పుడు తమ భూములపై తమకే అధికారం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పే విషయాలపై రైతులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ధరణి ఉండడం వల్లనే ఈ మూడు నాలుగేళ్ల నుంచి భూములు గొడవలు తగ్గాయని అంటున్నారు. యాభై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇంత మంచి ఆలోచన ఎందుకు చేయలేక పోయిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మరుక్షణమే ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయని చెబుతున్నారు. ధరణిని తొలగిస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నారు.
మాకు 15 ఎకరాల భూమి ఉన్నది. వరి, పత్తి, మక్క పంటలు సాగు చేసుకుంటున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కాంగ్రెసోళ్లు వద్దంటున్నరు. వాళ్ల పాలనత్తే భూముల రికార్డులు అస్తవ్యస్తం చేసి రైతులను గోసపెడుతరు. రికార్డులు ఇప్పుడే భద్రంగా ఉన్నయ్. పాత రోజులు మళ్లీ వస్తే రైతులు ఆగమైపోవల్న. పంట పంటకు వచ్చే పెట్టుబడులు, బీమా సౌకర్యం ఏం గావాలే? రైతుల బ్యాంక్ ఖాతాలో ధాన్యం పైసలు పడయి.
రైతు బీమా అందకుండా అయితది. భూముల కిరికిరి పెట్టుకుని పంచాయితీలతో ఎవుసం పక్కనబెట్టి ఆఫీసులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తింపుతరా? కాంగ్రెస్కు ఓట్లేస్తే రైతుల బతుకులు మారుతయా..? ధరణి రద్దు చేస్తే పంట లెక్కలు సక్రమంగా ఉండలేదన్న సాకు సూపి ఎరువులు, విత్తనాలు అందకుండా జేస్తరు. వాటి కోసం మళ్లా చెప్పులు లైన్లో బెట్టి పోలీసోళ్ల దెబ్బలు తినుడు తప్పదు. సర్కార్ రైతు సంక్షేమ పథకాలు అందకుండా కాంగ్రెస్ చూస్తోంది. ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా రైతులు కేసీఆర్కు జై కొట్టాలే. కాంగ్రెస్ను తరిమి తరిమి కొట్టాలే. ధరణిని ముట్టుకుని రైతుల జోలికి వస్తే సాగనంపాలే.
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి రైతుల గో స తీర్చింది. ఆఫీసుల పొంటి తిరుగనవసరం లేకుంటేనే భూమిని కొన్నవాళ్ల మీదికి ఎక్కితున్నరు. వెంటనే మార్పిడి చేసిన కాగితాలు చేతుల పెడుతున్నరు. వారం తిరుగకముందే పట్టా బుక్కు ఇంటికి వత్తున్నది. గింత మంచిగున్న పద్ధతితో రైతులంద రూ సంతోషంగా ఉన్నరు. కానీ కాంగ్రెసోళ్లు మేం కొత్తది తెత్తమంటున్నరు. పాత కథనే మళ్లా మొదటికి తెత్తమంటున్నరు. పట్వార్లను తెచ్చి ఉన్న భూ ములను గుంజుకోవాలని సుత్తున్నరు. కానీ వారిని రైతులు నమ్మడం లేదు. కచ్చితంగా మాకు
-మబ్బు శంకర్ రైతు, బేగంపేట (రామగిరి)
తెలంగాణ రాక ముందు భూముల రికార్డులు సక్కగుండేవి కాదు. ఏ సమస్య ఉన్నా దళారుల దగ్గరికి పోతే వాళ్లు పట్వార్ల వద్దకు తీసుకెళ్లేవాళ్లు. ఇగ వాళ్లు ఈ కాగితం తెమ్మని..అది తెత్తే ఇంకోటి తెమ్మని నెలలకు నెలలు తింపేటోళ్లు. పైసలిత్తేగానీ పనికాకపోయిది. పనయినా పేర్లో, భూమి వివరాలో తప్పుగా ఎక్కించి కిరికిరి పెట్టేది. ఈ బాధలు గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ అచ్చినంక ధరణి పోర్టల్ తెచ్చిండు. అన్ని రికార్డులను దీనిలోనే ఎక్కించిన్రు. ఏదైనా సమస్య ఉంటే దరఖాస్తు ఇయ్యంగనే ఆన్లైన్లోనే పరిష్కరాం జేత్తున్నరు. కానీ కాంగ్రెస్సోళ్లేమో గింత మంచిగున్న వ్యవస్థను కాలరాత్తం అంటున్నరు. బుద్ధి తక్కువై అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు. వాళ్లు అధికారంలోకి రావడం కలనే. కానీ ఒకవేళ గిట్ల వత్తే పట్వారుల మళ్లత్తరు. పాత కథ ముందటికత్తది.
-బుర్రగడ్డ లచ్చయ్య, కుక్కలగూడూర్ (పాలకుర్తి)
భూమి కౌలుకు ఇస్తే రాత పూర్వకంగా కౌలు ఒప్పందం చేసుకోవాలని చట్టం తేస్తే ఏట్లా,, పట్టాదారులు ఎవ్వరు ఇట్ల ఎందుకు ఇస్తారు. ఇట్లయితే రాత్రికి రాత్రే వాళ్ల పొంట అయ్యే ప్రమాదముంటది. ధరణి రద్దుచేసి, కౌల్దార్ చట్టాలు తేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 56 కాలాలతో పాత పద్దతి తెస్తే రైతులు భూమి హక్కులను కో ల్పోతారు. ప్రభు త్వం ఇచ్చే రైతుబందు లాంటి పథకాలుకూడా అందవు. కాంగ్రెస్ తెలివితక్కువ నిర్ణయాలు రైతుల పాలిట శాపాలుగా మరుతా యి. ఇప్పడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాఫీ గా, రైతులకు మంచి సౌలత్ ఉన్నది. ఉన్న పథకాలను ఊడగొట్టే కాంగ్రెస్ను రైతులెవరూ నమ్మరు.
– నలిమెల సుధాకర్, కుక్కలగూడూర్ (పాలకుర్తి)
ధరణి పోర్టల్ తీసేస్తే రైతులు ఆగమవుడే. గతంలో రెవెన్యూ సిబ్బంది రికార్డులను ఇష్టారాజ్యంగా రాసేటోళ్లు. ఒకల భూమి ఇంకొకలకు రిజిస్ట్రేషను చేసేటోళ్లు. పాలోళ్లు రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి భూములు పట్టాలు చేయించుకునేటోళ్లు. దీంతో గొడవలు జరిగి పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతుండే. ఇట్లా అనేక సమస్యలు వచ్చేవి. ధరణి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులందరూ ఉంటేనే అన్నదమ్ముల భూములు సమానంగా పంపిణీ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కూడా రైతు వేలి ముద్ర ఉంటేనే ఇంకొకరి పేరు మీదకు ఎక్కుతుంది. లంచాలు లేవు, ఏ ఇబ్బంది లేదు. ధరణినే ఉండాలి.
– కొల్లూరి మధునయ్య, రైతు, కొలనూర్ (ఓదెల)