సిరిసిల్ల టౌన్, మార్చి 1: కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి శాశ్వత పోటీదారే తప్పా..పది సార్లు బరిలో నిలిచినా ఎమ్మెల్యేగా గెలువలేరు..’ అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎద్దేవా చేశారు. ‘సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల దీవెనలతోనే కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు..ఆయన నేతృత్వంలోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో పురోగమించింది. అని ఉద్ఘాటించారు. ఇతర రాష్ర్టాలకు చెందిన నాయకులు సిరిసిల్ల అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వీకేండ్ లీడర్తో ఇక్కడి ప్రజలకు ఒరిగిదేమీలేదని విమర్శించారు. కేకే సన్నాసి కాబట్టే ప్రజలు పదే పదే ఒడిస్తున్నారని చురకలంటించారు.
ఉద్యమకాలంలో హైదరాబాద్లో ఉంటూ వకాలత్ చేసుకొనే ఆయన పదవి కోసమే కేసీఆర్ పంచనచేరాడన్నారు. ఉమ్మడి పాలనలో బీఆర్ఎస్ నాయకులు పేదల ఇండ్ల కోసం, సాగునీరు, కరెంట్ కోసం పోరాడిన సందర్భంలో కేకే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పెద్దూరు గల్ఫ్ బాధితులకు కేటీఆర్ న్యాయం చేస్తే ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆక్షేపించారు. 90శాతం పూర్తయిన కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులపై రాద్ధాంతం చేస్తున్నాడని మండిపడ్డారు. సిరిసిల్లకు దిక్సూచి వంటి నాయకుడి గురించి ఇష్టానుసారం మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. కేకేకు దమ్ముంటే మల్కపేట పనులపై మీడియాకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఎండాకాలంలో అప్పర్ మానేరును నింపిన ఘనత కేటీఆర్కే దక్కిందని కొనియాడారు. వందల కోట్లు వెచ్చించి చెక్డ్యాంలు నిర్మింపజేశారన్నారు. కేసీఆర్ పాలనలో మిగిలిన అరకొర పనులకు నిధులు తెచ్చి కేకే తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. నీవు తెచ్చిన రూ.5కోట్ల ఆశ చూపి నాయకులను చేర్చుకుంటున్నాడని మండిపడ్డారు. కేకే సన్నాసి కాబట్టే ఆ భాషనే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. మరోసారి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమికొడతామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూ రి ప్రవీణ్ మాట్లాడుతూ, కేటీఆర్పై మహేందర్రెడ్డి చేసిన విమర్శలు తీవ్రంగా ఖండించారు. సిరిసిల్ల ప్రజలు గొప్పగొప్ప వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారని పేర్కొన్నారు. స్థానిక రాజకీయాల్లో ఏనా డూ దూషణల పర్వం చూడలేదన్నారు.
ప్రజల అభిమానం చూరగొనలాంటే గతంలో జరిగిన అభివృద్ధి కన్నా గొప్పగా చేసి చూపించాలని హితవు పలికారు. ఏటా ఫిబ్రవరిలోనే నేత కార్మికులకు బతుకమ్మ చీర ల ఆర్డర్లు ప్రభుత్వం అందించిందని, తద్వారా నేత కార్మికులతోపాటు వస్త్ర పరిశ్రమ అనుబంధం రంగంలోని అనేక రకాల కార్మికులు లబ్దిపొందారని చెప్పా రు. కానీ కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడంలేదని విమర్శించారు. వర్కర్ టూ ఓనర్ షెడ్లు పూర్తయ్యాయని, మీకు నచ్చిన విధంగా లబ్ధిదారులను ఎంపిక చేసి కార్మికులను యజమానులుగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నాలుగు సార్లు పోటీచేసిన నిన్ను ప్రజలు ఎందుకు ఆదరించడం లేదో ఆలోచించుకోవాలన్నారు.
పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, మున్సిపల్ కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజం చేసిన ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశారు. ఆయన వార్డులో 55 లక్షలు కేటాయించామని తెలిపారు. ఎన్నికల ముందు 40కోట్ల పనులకు టెండర్ పూర్తి చేశామన్నారు. విలీన గ్రామాలకు 16కోట్లు, పట్టణంలో 22కోట్లు, 2కోట్లు జంక్షన్ల సుందరీకరణ కోసం టెండర్ ప్రక్రియ చేపట్టనున్నామన్నారు. కాంగ్రెస్ సర్కారు తాటాకు అంతటి నిధులను రద్దు చేసి చింతాకు వంటి నిధులు కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే 40కోట్ల టెండర్ నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్టీ మారాలనుకున్న సందర్భంలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాద న్నా రు.
మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు ముందున్నాయన్నారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాజకీయాల్లో గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. సమావేశంలో బల్దియా చైర్పర్సన్ జిందం కళ, జిల్లా గ్రం థాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఏఎం సీ మాజీ చైర్మన్ అందె సుభాష్, న్యాలకొండ రాఘవరెడ్డి, మ్యాన రవి, ఎండీ సత్తార్, గుండ్లపల్లి పూర్ణచందర్, అన్నారం శ్రీనివాస్, దార్ల సందీప్, సుంకపాక మనోజ్కుమార్, మునీర్, షాదబ్, సిఖిందర్, కంచర్ల రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.