పెగడపల్లి, ఆగస్టు 3: ‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కండ్లుమండించుకుంటున్నరు.. ధరల పెరుగుదలకు కారణం కేంద్రమైతే రాష్ట్రంపై విమర్శలా..? అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం పెగడపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ.24 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, 109 మందికి రూ.35 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని, ఎక్కడ చూసినా పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరుస్తోందని వివరించారు.
ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటివరకు 25 వేల మందికి సీఎంఆర్ఎఫ్ కింద కోట్లాది రూపాయలు వైద్య ఖర్చులకు అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రూ.7229 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ నెల నుంచి కొత్తగా 11 లక్షల మందికి నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, అలాగే త్వరలోనే నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇన్ని చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘నేనొక్కటే ప్రశ్నిస్తున్నా.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ వంటి ఒక్క పథకమైనా ఉందా చెప్పాలి..?’ అని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎంపీపీ గోళి శోభ-సురేందర్రెడ్డి, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, విండో చైర్మన్లు ఓరుగంటి రమణారావు, కర్ర భాస్కర్రెడ్డి, మంత్రి వేణుగోపాల్, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఎంపీడీవో పుల్లయ్య, సర్పంచులు మేర్గు శ్రీనివాస్, ఉప్పలంచ లక్ష్మణ్, నేరెళ్ల హారిక-గంగాధర్, ఎంపీటీసీలు బొమ్మెన జమున-స్వామి, సింగసాని విజయలక్ష్మి-స్వామి, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, కో-ఆప్షన్ సభ్యుడు రహీం, యూత్ అధ్యక్షుడు సంతోష్ ఉన్నారు.
మహిళల ఆర్థిక అభ్యున్నతే ధ్యేయం
ధర్మారం, ఆగస్టు 3: ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని మంత్రి ఈశ్వర్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు బుధవారం కుట్టు మిషన్లను పంపిణీ చేసి మాట్లాడారు. అలాగే శిక్షణ పొందిన మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సాయి మిత్ర కుట్టు శిక్షణ కేంద్రం, బ్యూటీ పార్లర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిపై పూలు చుల్లుతూ మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. కోఆర్డినేటర్ రేణుక, శిక్షణ ఇచ్చే మహిళలను మంత్రి అభినందించారు. ఈ కేంద్రానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయించి తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్తో పాటు ఇతర మండల ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. ఇక్కడ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల లత, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచులు మల్లే శం, చెనెల్లి సాయి కుమార్, ఎంపీటీసీలు శ్రీనివా స్, తిరుపతి, పార్టి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ నివాస్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ పట్టణాధ్యక్షుడు తిరుపతిరావు, అనుబంధ విభాగాల మండలాధ్యక్షులు ఎండీ హఫీజ్, దేవి నళినీకాంత్, నాయకులు వెంకట స్వామి, రాజేందర్ ఉన్నారు.