రాయికల్, ఫిబ్రవరి 18 : గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అల్లీపూర్ గ్రామంలో రూ.15 లక్షలు, సింగారావుపేట్, శ్రీరాంనగర్, ఆలూరు, ఉప్పుమడుగు, కుమ్మరిపల్లి గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్నసీసీ రోడ్లకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. రాయికల్ పట్టణంలోని మూడో వార్డు తురుక కాశీ నగర్లో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పట్టణ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, సర్పంచులు రామ్మోహన్ రావు, రాజమౌళి, భాగ్యలక్ష్మి-ముత్తయ్యగౌడ్, స్వప్న, ఎంపీటీసీలు సురేందర్ రెడ్డి, నాగరాజు, ఉప సర్పంచులు భీమయ్య, సరిత శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యుడు ముఖీద్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తలారి రాజేశ్, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, ఆర్టీఏ జిల్లా మెంబర్ సుధాకర్రావు, లాల్చావ్లా రాజేశ్, బరం మల్లేశ్, కొత్తపల్లి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్పర్సన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్ సాయికుమార్, శ్రీధర్రెడ్డి, అనిల్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 18 : జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖానలో రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో 9 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్, కో ఆప్షన్ సభ్యుడు రియాజ్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్, గంగాధర్, సాయి, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.