కరీంనగర్ : కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలు జరుపుకునేందుకు ఫంక్షన్హాల్స్ను అనుమతించవద్దని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరు క్రాంతి ఫంక్షన్హాల్ యజమానులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పొందిన వారు మాత్రమే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో ఫంక్షన్లను జరుపుకునేందుకు అనుమతించాలన్నారు.
ఫంక్షన్ హాల్స్లో పాటించాల్సిన కొవిడ్ నిబంధనలు, పారిశుధ్య పనులపై చర్చించడానికి కమిషనర్ ఫంక్షన్ హాల్ల యజమానులతో గురువారం ఎంసీకే సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేసేందుకు కమ్యూనిటీ హాల్ యజమానుల సహకారం కోరారు. ప్రభుత్వ అనుమతి పొందిన వారికి మాత్రమే హాల్స్ను అద్దెకు ఇవ్వాలని ఆమె తెలిపారు. ఎవరైనా కొవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.