తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం సమావేశం కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు..
జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజు ఏ కార్యక్రమం చేపట్టాలి, మూడు వారాల ఉత్సవాల విశిష్టత, ప్రాముఖ్యతను సీఎం వివరించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణపై సీఎం లోతుగా విశదీకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
– కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)