కార్పొరేషన్, ఏప్రిల్ 8: కరీంనగరంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం నగరంలోని ఉజ్వల పార్ సమీపంలో మంచినీటి పంపింగ్ వ్యవస్థ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను తాగునీటికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో తాగునీటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..? ఎప్పుడెప్పుడు నీటిని సరఫరా చేస్తున్నారు? ఎంత పరిమాణంలో ఇస్తున్నారు? ఎల్ఎండీ రిజర్వాయర్లో ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు ఉందని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు అదనంగా ఒక మోటర్ను ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకోసం కొత్తగా ఒక ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఆటంకం లేకుండా తాగునీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ పట్టణంలో కొద్ది నెలల వరకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ ఈఈ బీ మహేందర్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 8 పార్క్ నిర్వహణపై నిర్లక్ష్యాన్ని వీడాలని, పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి పర్యాటక శాఖ సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్లోని ఉజ్వల పార్ను సోమవారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పార్లో కలియ తిరిగారు. ఉజ్వల పార్ నిర్వహణ తీరు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పార్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని రకాల మొకలు, గార్డెన్ సంరక్షణకు కృషి చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ఫౌంటేయిన్ల వద్ద పిచ్చి మొకలు తొలగించాలని సూచించారు. పార్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాన్ని కలెక్టర్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, పర్యాటక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.