రాంనగర్, మార్చి 1: ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ఇంకా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు ఉపయోగపడే ఆపదమిత్ర వలంటీర్ల ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆపదమిత్ర వలంటీర్ల ఎంపిక ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వలంటీర్ల ఎంపికపై అన్ని శాఖల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కరీంనగర్ జిల్లాలో 300 మంది ఆపదమిత్ర వలంటీర్లను ఎంపిక చేయాలని తెలిపారు.
ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు, నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు, గజ ఈతగాళ్లు, క్రీడాకారులు, జీపీ వరర్లు, స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ టీచర్లకు వలంటీర్ల ఎంపిక సందర్భంగా ప్రాధాన్యం ఇవ్వాలని పేరొన్నారు. అలాగే మిగతా వారిని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ నుంచి ఎంపిక చేయాలని చెప్పారు. ఈ నెల మూడో తేదీలోగా ఎంపికైన వలంటీర్ల లిస్ట్ తయారుచేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఆపద సమయంలో బాధితులను రక్షించే అంశంపై వలంటీర్లకు 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేరొన్నారు. అధికారులందరూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో పవన్ కుమార్ వలంటీర్ల ఎంపిక, శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీధర్, మెప్మా పీడీ రవీందర్, స్పోర్ట్స్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎన్వైకే కోఆర్డినేటర్ రాంబాబు, ఫైర్ ఆఫీసర్ వెంకన్న, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఎన్సీసీ ఆఫీసర్ రాజు, ఎన్సీసీ 9వ బెటాలియన్ సుబేదార్ ద్రోవ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టరేట్, మార్చి 1: జిల్లాలో ప్రజా పాలన సహాయ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్యాస్ సబ్సిడీ, గృహజ్యోతి పథకాల అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకాల అమలులో లబ్ధిదారుల ఇబ్బందులు తీర్చేందుకుగానూ ప్రజాపాలన సహాయ కేంద్రాలు దోహదపడతాయని పేరొన్నారు. ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా పాలన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలని పేరొన్నారు.
కమాన్చౌరస్తా, మార్చి 1 : విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువులో హీరోయిజం చూపించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా కేంద్రంలోని ముకరంపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల(పురాతన)లో స్నేహిత కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మంచిగా చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు.
ఎవరి నుంచైనా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఉన్నా, అన్యాయానికి గురైనా విద్యార్థులు అధికారులకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, మారెటింగ్ అధికారి పద్మావతి, సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృపారాణి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంత, పాఠశాల హెచ్ఎం చాంద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న మ్యూజియాన్ని ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. మ్యూజియం భవనాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆధునీకరణకు అంచనాలను రూపొందించాలని, నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు.