ఆసిఫాబాద్ :సద్దుల బతుకమ్మ నిమజ్జనం కార్యాక్రమంలో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేసే పెద్దవాగు స్థలాన్ని డిఎల్పీవో రమేశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే దారిలో లైటింగ్ ఎర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పిల్లలను చెరువులవద్దకు అనుమతించవద్దని నిమజ్జనం ప్రదేశంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.