కలెక్టరేట్, జూలై 28 : జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంపులు, మంచినీరు, టాయిలెట్లు, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పునకు సంబంధించిన స్పష్టమైన నివేదిక సత్వరమే సమర్పించాలని సూచించారు. ఓటరుగా నమోదు చేసుకున్న వారి దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. చనిపోయిన ఓటర్ల వివరాలు పరిశీలించిన అనంతరమే జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, ఆర్డీవోలు కే మహేశ్వర్, హరిసింగ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన డీఐఈవో
ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్రెడ్డి శుక్రవారం కలెక్టర్ గోపిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, జిల్లాలోని ఇంటర్ విద్యపై వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాలు అద్భుతంగా ఉండాలని, అందుకనుగుణంగా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ఉన్నత స్థితిలో నిలిపేందుకు కృషి చేస్తానని డీఐఈవో తెలిపారు. ఇంటర్ విద్యాశాఖ సిబ్బంది ముప్పిడి కిరణ్కుమార్, బల్బీర్సింగ్ ఉన్నారు.
కలెక్టర్కు టీపస్ నాయకుల వినతి
కమాన్చౌరస్తా, జూలై 28 : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ బీ గోపి ని కలెక్టరేట్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎకువ సిబ్బంది ఉన్న పాఠశాల నుంచి తాతాలికంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని కోరారు. ఇక్కడ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్ట రాజేశ్వర్, గన్నమనేని రంగారావు, రాష్ట్ర కార్యదర్శి అన్నమనేని తిరుపతిరావు, జిల్లా బాధ్యులు ప్రతి కంఠం వినయధర్రాజు, మాడభూషిని శ్రీనివాస్, తాటి రాజేశ్వరరావు, మోతే అచ్యుత రెడ్డి, రంగోజు శ్రీనివాస్, ఉడుత శంకరయ్య, ద్యావనపల్లి శ్రీకాంత్, ఓదెల శివకుమార్ ఉన్నారు.