కరీంనగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : మునుపెన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం పది రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా జలమే కనిపించింది. అనేక చోట్ల ఇండ్లలోని వరద వచ్చి జన జీవనం అతలాకుతలమైంది. చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరింది. వందల చెరువులు మత్తళ్లు దునికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వాళ్లు, ఇండ్లు కూలి కొందరు నిరాశ్రయులయ్యారు. వి ద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైతు ల పంటలు నీట మునిగాయి. రోడ్లకు గండి పడి, కల్వర్టుల మీదుగా వరద ఉధృతి కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఇంత జరిగినా ఎక్కడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలే దు. ఎక్క డా పశువులు కూడా మృత్యువాత పడ లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యం త్రాంగం పూ ర్తి స్థాయిలో అప్రమత్తం కావడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అతి భారీ వర్షాల ను సైతం లెక్క చేయకుండా అధికారులు ప్రజల్లో ఉండి సేవలు అందించారు. ఎక్కడ ఉపద్రవం ఉం టే అక్కడికి వె ళ్లిన వివిధ శాఖల అధికారులు ప్రజలకు కొండంత అండగా నిలిచారు. కలెక్టర్ బీ గోపి కొత్తగా బాధ్యతలు తీసుకున్నా అధికారులతో ని త్యం సమీక్షలు జరుపుతున్నారు. జమ్మికుంటలో క్షే త్ర స్థాయి పర్యటన చేసి పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రతి నిత్యం పర్యవేక్షించిన రెవెన్యూ శాఖ
విపత్తులు ఏవైనా ప్రజలను ఆదుకోవడానికి రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉంటుంది. ఈసారి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ శాఖ మిగతా శాఖలను సమన్వయ పరుస్తూ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ముఖ్యంగా కలెక్టర్ బీ గోపి, అనదపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్ఐలు ఇలా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అందరూ గ్రామాలు, పట్టణాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి నష్టం జరిగినా వెంటనే అప్రమత్తమై అంచనాలు వేశారు. నివేదికలు రూపొందించిన ప్రభుత్వానికి అందిస్తున్నారు. జమ్మికుంట మండలం వావిలాలలో హైటెన్షన్ విద్యుత్తు టవర్ల నిర్మాణానికి వచ్చిన కూలీల ప్రాణాలను కాపాడటంలో రెవెన్యూ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించారు.
పోలీసుల నిరతంతర నిఘా
ప్రజలను అప్రమత్తం చేయడంలో, ఎలాంటి ఉపద్రవాలు ఎదురవకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ కీలక పాత్రను పోషించింది. వరద ఉధృతి ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పికెటింగ్లు ఏర్పాటు చేసింది. వాగులు, వంకలు, రోడ్డు డ్యాంలు, చెరువుల మత్తళ్లు దుంకిన చోట వరద ఉధృతి ఉంటే అక్కడ పోలీసులు పహారా కాశారు. రోడ్లపై వరద ఉధృతి ఉంటే ముందుగానే హెచ్చరించి వాటిని మూసివేయించారు. వరద తగ్గే వరకు రాకపోకలు నిలిపి వేశారు. రోడ్లకు రెండు వై పులా కాపలా కాశారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించి ప్రాణాలు కాపాడారు. సందర్శకులు ఎక్కువగా ఉండే ఎల్ఎండీ జలాశయం, కేబుల్ బ్రిడ్జ్పై పోలీసులు నిరంతరం నిఘా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు.
చిన్న నీటి వనరులను రక్షిస్తూ
చిన్న నీటి వనరుల సంరక్షణలో నీటి పారుదల శాఖ అధికారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రతి చిన్న కుంట పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. దాదాపు ప్రతి చెరువు, కుంటలోని పూర్తి స్థాయిలో నీరు రాగా, వందలాది చెరువులు మత్తళ్లు దుంకాయి. జిల్లాలో 1,376 చెరువులు, కుంటలు ఉండగా ఒక్క శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు (చెక్డ్యాం)కు మాత్రమే గండి పడింది. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏఈలు, జేఈలు, డీలు అందరూ క్షేత్ర స్థాయిలో ఉండి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నారు. ముఖ్యంగా ఎల్ఎండీ జలాశయంలోకి వరద ఉధృతి పెరగడంతో ముం దుగానే అంచనా వేసి దిగువ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసి, గేట్లు తెరిచారు.
పారిశుధ్యంపై పర్యవేక్షణ
వర్షాల వల్ల కలిగే నష్టాల కంటే పారిశుధ్యలోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడరాదని జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఇందుకు నిరంతర కృషి చేస్తున్నారు. నీటి సరఫరాలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. పైప్లైన్ లీకేజీలు ఉంటే అరికడుతున్నారు. మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ఇండ్ల మధ్యలో నిలిచిన వరద నీటిని కాలువలు తీసి పారదోలుతున్నారు. ఎక్కడైనా మురుగు గుంతల్లో నీళ్లు నిలిస్తే ఆయిల్ బాల్స్ వేసి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో ఉన్నా సర్పంచులు ప్రత్యేక కూలీలను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.
ఆటంకం లేని విద్యుత్ సరఫరా
భారీ వర్షాలు కురిసినా, గాలులు వీచినా ముం దుగా పోయేది కరెంట్ సరఫరా. కానీ, ఇంత వర్షం కురిసినా, ఈదురు గాలులు వీస్తున్నా ఎక్కడో ఒకటీ అర తప్ప కరెంట్ సమస్యలు లేకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. జి ల్లాలోని ఇల్లందకుంట మండలం సిర్సేడు, జమ్మికుంట మండలం వావిలాల విద్యుత్ ఉప కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇందులో సిర్సే డు విద్యుత్ ఉప కేంద్రాన్ని తక్షణమే మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. వావిలాలలో మరమ్మత్తులు కొనసాగుతుండగా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో దీని పరిధిలోని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ విద్యుత్ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
రోడ్లకు తక్షణ మరమ్మతులు
జిల్లాలో ఎక్కడైనా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయించడంలో పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. దెబ్బతిన్న కల్వర్టులకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఆటంకాలు లేకుండా కృషి చేస్తున్నారు. అతి భారీ వర్షాలు కురిసిన ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, కరీంనగర్ రూరల్, గంగాధర, చొప్పదండి, రామడుగు తదితర మండలాల్లో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
రైతులకు అండగా వ్యవసాయ శాఖ
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ శాఖలోని డీఏవో నుంచి మొదలుకుంటే ఏఈవో వరకు క్షేత్ర స్థాయిలోనే ఉంటూ రైతులకు సేవలు అందిస్తున్నారు. అతి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాటిని రక్షించేందుకు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పంట చేళ్లలో నిలిచిన వరద నీటిని ఏ విధంగా బయటికి పంపాలో, అనంతరం ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో రైతులకు వివరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల్లో అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతుల మధ్యనే ఉండి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అ ప్రమత్తంగా ఉంటున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఐకేపీ సంఘాలతో కలిసి గ్రామా లు, పట్టణాల్లో పర్యటిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యులు, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఏఎన్ఎంలు, గ్రామాల స్థాయిలో ఆశా వర్కర్లు నిరంతరం పర్యటిస్తున్నారు. ప్రతి రోజూ జ్వరాలపై సర్వే చేస్తున్నారు. రెసిడెన్సియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులను నిత్యం పరీక్షిస్తున్నారు. అంతే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్లో డివిజన్ స్థాయి, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి, గ్రామాల్లో గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం ఈ కమిటీ గ్రామంలో పర్యటించి తాగు నీటి సరఫరా, పారిశుధ్యం పనులను పర్యవేక్షిస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజల్లో అవగాహన తెస్తున్నారు.