కోనరావుపేట, జనవరి 20: అర్హులైన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్, రామన్నపేట, కమ్మరిపేట తండాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. గ్రామాలతోపాటు మారుమూల గిరిజన తండాల్లో 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని బీఎల్వోలకు సూచించారు.
ఓటర్ల జాబితాలో పేర్లు తప్పులులేకుండా, ఓటు హక్కు మిస్సింగ్ కాకుండా చూడాలన్నారు. బీఎల్వోలు ఓట రు జాబితాపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ నెల 22 వరకు ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చని, ఆదివారం సైతం కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉండాలన్నారు. ఇక్కడ తహసీల్దార్ విజయ్ప్రకాశ్రావు, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ రాజశేఖర్, తదితరులు ఉన్నారు.
రుద్రంగి, జనవరి 20: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ లెవల్ అధికారులతో ఓటరు నమోదు నిర్వహించగా, తహసీల్దార్ శ్రీలత పరిశీలించారు. ఓటు హక్కు నమోదు కోసం బూత్ పరిధిలోని బీఎల్వోలు, తహసీల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఇక్కడ ఆర్ఐ నవీన్, బూత్లెవల్ అధికారులు ఉన్నారు.