జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ నా యకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య అంబేద్కర్ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, నాయకులు ఆకునూ రి శంకరయ్య, న్యాలకొండ రాఘవరెడ్డి, కుం బాల మల్లారెడ్డి, ఆర్డీవో రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్, డీపీవో వీరబుచ్చయ్య, డీవైఎస్వో రాందాస్ పాల్గొన్నారు.
వేములవాడలో ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బింగిమహేశ్, బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, గోలి మహేశ్, వేములవాడ డివిజన్ ఆ టో సంఘం అధ్యక్షుడు దేవరాజు, నాయకు లు రామతీర్థపు రాజు , కుమ్మరి శ్రీనివాస్, ముద్రకోల వెంకటేశం, పోతు అనిల్, సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మైలారపు రాము పాల్గొన్నారు.
గంభీరావుపేట మండల పరిషత్లో ఎం పీపీ వంగ కరుణ, గోరంటాలలో జడ్పీటీసీ కొ మిరిశెట్టి విజయ, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాలు, ఆయా పార్టీల నాయకులు కేక్ కట్ చేసి మహనీయుడికి ఘన నివాళులర్పించారు. ఇక్కడ ఎంపీడీవో రాజేందర్, వైస్ఎంపీపీ దోసల లత, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ఎంపీవో రాజశేఖర్, ఆయా పార్టీల మండలాధ్యక్షులు వెంకటస్వామిగౌడ్, గంట అశోక్, హహీద్, తదితరులు ఉన్నారు.
కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళుర్పించా రు. ధర్మారంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ఎన్గందుల అనసూయ, అంబేద్కర్ సంఘం నాయకులు గడ్డం జితేందర్, కర్రోల్ల ఎల్లయ్య, ఎన్గందుల నర్సింహు లు, లింగాల దాసు, తదితరులు ఉన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఇక్కడ అంబేద్కర్ సం ఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు చా కలి రమేశ్, దేవరాజు, రాజారామ్, ఎల్లం, మల్లయ్య, శ్రీనివాస్, బాల్రెడ్డి, నరసింహరెడ్డి, అంజయ్య, వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.
సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో న్యాయవాదులు అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఇక్కడ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు దుర్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటి, కార్యదర్శి నాగరాజుగౌడ్, న్యా యవాదులు ధర్మేందర్, రవీందర్రావు, అంజయ్య, విష్ణు, అనిల్, కర్నాకర్, అన్సారీ, మహేందర్, రాజయ్య, శేఖర్, రాజేశ్, కళ్యా ణి, తదితరులు ఉన్నారు.
తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో అంబేద్కర్ విగ్రహానికి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా మండల కేంద్రంలో అం బేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. వేడుకల్లో ఎంపీపీ పడిగెల మానస పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో నాయకులు మాట్ల మధు, బండి దేవదాస్గౌడ్, కోడూరి భాస్కర్గౌడ్, గజభీంకార్ రాజన్న, జాలగం ప్రవీణ్, మాట్ల శంకర్, రాజనర్సు, పడిగెల రాజు, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, కోడం రమణ, కోయ్యడ రమేశ్,
సిరిసిల్ల పరశురాములు, గుగ్గిళ ఆంజనేయులు, వం శీ, గనప మదన్, శివజ్యోతి, లింగం ఉన్నా రు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామా ల్లో నిర్వహించిన వేడుకల్లో కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, రెడ్యానాయక్, చెన్నమనేని కీర్తి, బొలగం నాగరాజు, పోచవేని సత్య, పాతూరి రాజిరెడ్డి, బుర్ర లక్ష్మి, ఒగ్గు ఉమ, పీ ఏసీఎస్ చైర్మన్ జీల కిషన్, నాయకులు చెన్నమనేని కమలాకర్రావు, గండ్ర రమేశ్రావు, జూపల్లి శ్రీనాథరావు, ఎరవెల్లి వెంకటరమణారావు, కిరణ్, శ్రీనివాసరావు, నారాయణగౌడ్, ఉలిచె తిరుపతి, దేవయ్య ఉన్నారు. అదేవిధంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17వ పోలీస్ బెటాలియన్లో అంబేద్కర్ చిత్రపటానికి అసిస్టెంట్ కమాండెంట్ రాందా స్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు, అనుపురంలో జడ్పీటీసీ మ్యాకల రవి, బీజేపీ నాయకులు ఎర్రం మహేశ్, శాత్రాజుపల్లిలో పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. అలాగే విలీన గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో కౌన్సిలర్లు విజయ, హన్మవ్వ, విజయ్, లక్ష్మి, శంకర్ పాల్గొన్నారు.
చందుర్తి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో మాల మహానాడు, ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో పీఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, కో ఆప్ష న్ సభ్యుడు బత్తుల కమలాకర్, మాల మహానాడు మండలాధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, నీరటి ప్రసాద్, మార్త సత్తయ్య, పొంచెట్టి రాకేశ్, తదితరులు ఉన్నారు.
ఇల్లంతకుంట మండలం పొత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, మధు, శేఖర్, కుమార్ ఉన్నారు. అలాగే అన్ని గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు.
వీర్నపల్లి మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారపు అరుణ్ కుమార్, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్య క్షుడు బోయిని రవి, నేతలు శ్రీరాంనాయక్, భగవంతం, తిరుపతి, అంబేద్కర్ సంఘాల నాయకులు, తదితరులు ఉన్నారు.
రుద్రంగి తహసీల్ కార్యాలయంతో పా టు మానాలలో అంబేద్కర్ జయంతి వేడుక లను నిర్వహించారు. ఇక్కడ ఆర్ఐ నవీన్, వైస్ఎంపీపీ పిసరి చిన్న భూమయ్య, మాజీ సర్పంచులు ప్రభలత, మనోహర్, అల్లూరి మానస, ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశం, నేతలు రాజరాం,గంగరాజం, అరుణ్, లిం గం, నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ చౌక్, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ చం ద్రయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళర్పించి, మాట్లాడారు. అంబేద్కర్ అశయాలు, ఆలోచనలకు తగ్గట్లుగా విధులు కొనసాగించాలని సూచించారు.