పెద్దపల్లి, నవంబర్ 30: పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో 2.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, పట్టణంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.
మార్కెట్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించవద్దని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి బల్దియా చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, వైస్ చైర్ పర్సన్ నాజ్మీన్ సుల్తానామొబిన్, కౌన్సిలర్లు ఇల్లందుల కృష్ణమూర్తి, లైశెట్టి భిక్షపతి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, పెంచాల రమాదేవి శ్రీధర్, మహంత కృష్ణ, చంద్రశేఖర్, మాధవి, పైడ పద్మరవి, ఎరుకల కల్పన రమేష్, స్వామి, గీతాంజలి వెంకటేశ్, సరేశ్, నూగిళ్ల మల్లయ్య, కో -ఆప్షన్ సభ్యులు చంద్రమౌళి, ఫహీం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జడల సురేందర్, డీఎంవో ప్రవీణ్రెడ్డి, ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్, మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్రెడ్డి, మేనేజర్ శివప్రసాద్, ఏఏఈ సతీశ్, టీ(బీ)ఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్కుమార్, మొబిన్, శ్రీకాంత్, శ్రీధర్, రమేశ్, రవి, సాబీర్ ఖాన్, గండు రంగయ్య, కాంట్రాక్టర్లు బయ్య కొమురయ్య, కనకయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.