ధర్మపురి, అక్టోబర్ 20 : ‘రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నయి. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను బద్నాం చేయాలని అసత్యప్రచారం చేస్తున్నరు. బూటకపు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నరు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు. నేనొక్క టే చెబుతున్నా.. అన్నీ అబద్ధాలు చెబుతూ, పథకాలు, అభివృద్ధికి అడ్డుతగిలే ఆ రెండు పార్టీలకు ఈ సారి డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రచారం చేయాలి.
దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పాలని’ బీఆర్ఎస్ శ్రేణులకు పెద్దపల్లి ఎంపీ బీ వెంకటేశ్నేతకాని పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో మండలస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమన్వయ సమావేశానికి హాజరై, మాట్లాడారు. నాడు ఆగమైన తెలంగాణ స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నదని తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, దేశంలోనే ముందంజలో నిలుస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని బీరాలు పలుకుతున్నారని, నాడు వారి పాలనలో ఎందరో రైతులు అప్పుల పాలై బలవన్మరణం చెందితే రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు.
ఎలక్షన్లు రాగానే కొత్తబిచ్చగా ళ్ల మాదిరిగా గ్రామాలపై పడుతూ మాయమాట లు, మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని, ప్రజలు గమనించాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి ప్రతి గ్రామంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని, పనిచేసే ప్రభుత్వానికే అండగా నిలవాలని సూచించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ లాంటి మంచి మనిషిని నా జీవితంలో చూడలేదని, ధర్మపురి ఎమ్మెల్యేగా దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోపై గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ చిట్టిబాలు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు భారతపు గుండయ్య, నాయకులు వొడ్నాల మల్లేశం, శేర్ల రాజేశం ఉన్నారు.