వచ్చే నెల 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నా యి. అంటే వారం కూడా లేదు. సమయం సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన. ఇప్పటిదాకా ప్రిపేర్ అయినా తెలియని భయం. అయితే పరీక్షల వేళ విద్యార్థులు ఏమాత్రం టెన్షన్ పడినా అసలుకే ప్రమాదం. అందుకే బట్టీ పట్టకుండా ప్రశాంతంగా పునశ్చరణ చేసుకోవాలి. ఇది వరకు చదివిన పాఠ్యాంశాల్లోని ప్రధానాంశాలను మళ్లీ నెమరేసుకోవాలి. అప్పుడే మంచి మార్కులు సాధించే అవకాశముంటుందని విషయ నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఈ సారి సబ్జెక్టుకు రెండు పేపర్లు కాకుండా, ఒకటే పేపర్ ఉంటుందని, సబ్జెక్టులవారీగా ఏయే అంశాలపై శ్రద్ధపెట్టాలో, పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలా వివరిస్తున్నారు.
– కమాన్ చౌరస్తా, మార్చి 28
పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 3వ తేదీ నుంచే ప్రారంభమవుతుండగా, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. సమయం తక్కువగా ఉండడంతో ఒకరమైన భయం కనిపిస్తున్నది. కానీ, ప్రతి పరీక్షనూ ప్రశాంతంగా రాయాలనీ, అప్పుడే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఒకటి రెండు రోజులే ఉండడంతో ముఖ్యాంశాలను ఒకసారి నెమరేసుకోవాలనీ, టెన్షన్ వద్దని సూచిస్తున్నారు. అలాగాక హాల్లో ప్రవేశించింది మొదలు ఆందోళనపడితే తెలిసిన ప్రశ్నలకూ జవాబు రాయలేని పరిస్థితి తలెత్తుతుందనీ, తద్వారా ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేరని చెబుతున్నారు. కఠిన ప్రశ్నలను చూసి, టెన్షన్ పడేకంటే తేలికైన ప్రశ్నలకు చకచకా సమాధానాలు రాయడం మేలనీ, తద్వారా సమయం సద్వినియోగమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సారి సబ్జెక్టుకు రెండు పేపర్లు కాకుండా, ఒకటే పేపర్ ఉంటుందని, సబ్జెక్టులవారీగా ఏఏ అంశాలపై శ్రద్ధపెట్టాలో, పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలా వివరిస్తున్నారు.
– కమాన్ చౌరస్తా, మార్చి 28
ఇలా రాయాలి
పార్ట్-బీలో..
– గాజుల రవీందర్ తెలుగు ఉపాధ్యాయుడు
ఏ : లఘు ఉత్తరాత్మక ప్రశ్న: ఇందులో 4 ప్రశ్నలు ఉంటాయి. ఛాయిస్ ఉండదు. పద్య భాగం నుంచి రెండు, గద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం నాలుగు పంక్తులలో రాయాలి. ఈ నాలుగు ప్రశ్నలలో ఒక ప్రశ్న కవి/రచయిత పరిచయంపై ఉంటుంది.
బీ : నిబంధాత్మక ప్రశ్న(20, 21): 20వ ప్రశ్నలో పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయాలి. 21వ ప్రశ్న గద్యభాగం నుంచి రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయాలి. 22వ ప్రశ్న సృజనాత్మకతపై ఉంటుంది. ఇకడ కూడా రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయాలి. 20, 21వ ప్రశ్నల సమాధానాలు 10 పంక్తులలో రాయాలి.
– ఉమర్ అలీహిందీ ఉపాధ్యాయుడు
ఇంగ్లిష్ సబ్జెక్టులో గరిష్ఠ మారులు 80. పార్ట్ -ఏలో 60 మారులు, పార్ట్ బీ లో 20 మారులు. పార్ట్ -ఏలో ప్రశ్నలకు జవాబులు విద్యార్థి బుక్లెట్లోనే రాయాలి. పార్ట్ -బీ ప్రశ్నలకు జవాబులు అదే ప్రశ్నాపత్రంలో రాసి మెయిన్ ఆన్సర్ బుక్లెట్కు జత చేయాలి. మంచి మారులు సాధించేందుకు పాఠ్యపుస్తకంలోని ఏ, బీ, సీ రీడింగ్లను క్షుణ్ణంగా చదువుకోవాలి. ప్రతి యూనిట్ నుంచి నమూనా ప్రశ్నలను తయారు చేసుకోవాలి. ఏ, బీ, సీ చదువుకునే సమయంలో యాక్చువల్ ప్రశ్నలు, ఇన్ఫరెన్షియల్ ప్రశ్నలు, ఎక్స్రా పొలెటివ్ ప్రశ్నలు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ సబ్జెక్టు టీచర్ సహాయంతో ప్రిపేర్ చేసుకొని పరీక్షకు సిద్ధం కావాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి గరిష్ఠంగా 37 మారులు కేటాయిస్తారు.
అన్సీన్ ప్యాసేజ్ గానీ, అన్సీన్ పోయం గానీ ఇచ్చి దానికి ఐదు మార్కులు కేటాయించారు. అలాగే, క్రియేటివ్ రైటింగ్, మేజర్ డిస్క్రిప్సన్ గ్రూప్ ఏ, గ్రూప్ బీ నుంచి ఒక్కొక్కటి ఇస్తూ ఇంటర్నల్ ఛాయిస్గా ఒకటి రాయాలి. దీనికి పది మార్కులు కేటాయిస్తారు. 9వ ప్రశ్న నుంచి 12 వరకు పై చార్ట్స్ లేదా బార్ గ్రాఫ్స్ నుంచి రాయాలి. దీనికి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఉత్తమ జీపీఏ సాధించేందుకు ప్రతి విద్యార్థి మేజర్, మైనర్ డిసోర్సెస్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ విభాగంలో గరిష్ఠంగా 20 మార్కులు ఉంటాయి. ఇందులో వకాబులరీ, గ్రామర్లో మంచి పట్టు సాధించాలి. స్పెలింగ్, మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను గమనిస్తూ వాటిని యూనిట్ వైస్గా నోటీస్ చేసుకోవాలి. గ్రామర్ విభాగంలో ముఖ్యంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి, డైరెక్ట్ స్పీచ్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్తో పాటు గ్రామర్కు సంబంధించిన అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
– మంజూర్ అలీఇంగ్లిష్ ఉపాధ్యాయుడు
– రాచకొండ దేవదాస్ గణిత ఉపాధ్యాయుడు
గతేడాది నుంచే ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్ష ఒకే రోజు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహిస్తారు.
పార్ట్-ఏలో
మూడు లఘు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అన్నింటికీ సమాధానాలు రాయాలి. ఇందులో ఒక ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. లఘు ప్రశ్నలు మూడు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మారులు. అంతర్గత వెసులుబాటు లేదు. అలాగే, వ్యాసరూప ప్రశ్నలు మూడు ఉంటాయి. అంతర్గత వెసులుబాటు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 5 మారులు ఉంటాయి.
పార్ట్ -బీలో
ఆబ్జెక్టివ్ టైప్లో 10 బిట్లు ఉంటాయి. ప్రతి బిట్కు 1 మార్ ఉంటుంది. అయితే, ప్రశ్నాపత్రం విద్యాప్రమాణాల ఆధారంగా ఉంటుంది. విషయావగాహన ప్రశ్నలకు 40 శాతం కాబట్టి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. జీవశాస్త్రం సులభం అనుకుంటారు. కానీ, సునిశీతంగా పరిశీలించి చదవాలి. పటాలు అర్థవంతంగా గీయండి. పటాల పైన ప్రశ్నలు బిట్ పేపర్లో కూడా వస్తాయి. ప్రశ్నించడం పరికల్పన చేయడంలో జాగ్రత్త వహించి ప్రశ్నలు తయారు చేయాలి. నినాదాలు తయారు చేసేటప్పుడు రైమింగ్తో క్యాచీ ఉండాలి.
సమాచార నైపుణ్యంలో పేరాగ్రాఫ్/ టేబుల్ / పటం ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి చకగా చదివి/ పరిశీలించి జవాబులు రాయాల్సి ఉంటుంది. 9,10 చాప్టర్ల నుంచి బయోడైవర్సిటీ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. మొత్తంగా 10 చాప్టర్స్ చదవాలి. సిలబస్ తగ్గింపు లేదు.
ఈ సంవత్సరం ఒకే పేపర్లో సాంఘిక శాస్త్రంలో ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. అందులో మార్పులు చోటు చేసుకున్న సందర్భంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే విద్యార్థులకు 10 జీపీఏ సాధించవచ్చు. ఈ ప్రశ్నాపత్రం 80 మారులకు తయారు చేస్తుండగా, అందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బీ మొత్తం 3 గంటల సమయం ఉంటుంది. పార్ట్ -ఏ కు 60 మారులు. దీనికి సమయం 2:30 గంటలు. పార్ట్ -బీకి 20 మారులు. సమయం 30 నిమిషాలు. పార్ట్ -ఏ లో మూడు సెక్షన్లు ఉంటాయి. అందులో అతి లఘు సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు.
– ఆరెల్లి కుమారస్వామి సోషల్ టీచర్
పరీక్షల టైంలో ఆత్మవిశ్వాసంతో నేను బాగా రాస్తాను అనే భావనతో విద్యార్థులు ఉండడం చాలా ముఖ్యం. అనవసర వ్యాపకాల్లో తల దూర్చకుండా చదువు విషయాలపై ఆసక్తి చూపాలి. ఆహారం, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి. సమయపాలనతో పరీక్షల్లో విజయం సాధ్యం. ఇంకా ప్లానింగ్ తప్పనిసరి. సానుకూల ఆలోచనలతోటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. విలువైన కాలాన్ని పాడుచేసే సోషల్ మీడియా(వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్), టీవీలు, సినిమాలకు దూరంగా ఉండాలి.
– డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్