Ration Rice Seized | హుజురాబాద్ రూరల్, డిసెంబర్ 7 : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు మెరుపు దాడి చేసి రెండు ఆటో లను సీజ్ చేశారు.
అలాగే మిల్లు యజమానిపై 6-ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లై డీఎం కు అప్పగించారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఓఎస్డీ ప్రభాకర్, ప్రత్యేక అధికారి లక్ష్మారెడ్డి, టాస్క్ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్సై జంపయ్య తదితరులు పాల్గొన్నారు.