చొప్పదండి, జనవరి 18: పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు.
శ్మశాన వాటికకు కేటాయించిన ఐదెకరాల స్థలంలో చేపడుతున్న ప్రహరీ పనులను కొంతమంది అడ్డుకోవడంతో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ వెళ్లి పరిశీలించారు. ప్రహరీ పనులను యథావిధిగా చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట పలు కులసంఘాల నాయకులు ఉన్నారు.